Traffic Jam: ట్రాఫిక్ కార‌ణంగా అత్యంత‌ ర‌ద్దీగా ఉండే న‌గ‌రాలు ఏవో తెలుసా..?

Traffic Jam: ట్రాఫిక్ కార‌ణంగా అత్యంత‌ ర‌ద్దీగా ఉండే న‌గ‌రాలు ఏవో తెలుసా..?

Traffic Jam:  మన భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో  ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు కూడా పట్టణాలలో ట్రాఫిక్ జామ్ అవడంతో  జాబ్ కి వెళ్లేవారు కానీ లేదా ఇతర పనులకు బయటకు వెళ్లే వారికి చాలా సమయం అనేది వృధా అవుతుంది. ఇక కాలం మారుతున్న కొద్ది ఏవైతే పట్టణాలు మరియు నగరాలలో జనాభా అనేది  ఏకంగా పెరిగిపోతుంది.


 తద్వారా ఏంటంటే విద్య మరియు జాబుల కోసం  లేదా ఇతర పనులు కోసం ఎక్కువగా గ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరి వస్తుంటారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ నివాసం ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ప్రయాణించాలంటేనే ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాలలో ఉదయం గాని లేదా సాయంత్రం గాని కార్యాలయాలకు వెళ్లాలంటే నరకంగా మారుతుందని అంటున్నారు. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం


 ఇక తాజాగా  Tom Tom అనే సంస్థ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో గుర్తించింది. ఈ సమస్త చెప్పినటువంటి  సమాచారం ప్రకారం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి


 మన భారతదేశంలోని అత్యధిక ట్రాఫిక్ ఉన్నటువంటి నగరాల్లో బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ బెంగుళూరు అనేది మన దేశంలో మొదటి స్థానంలో ఉండగా  ప్రపంచంలోనే ఎక్కువ ట్రాఫిక్ గా ఉండే నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఎక్కువగా బెంగళూరులో ఉంటుందని.  ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే దాదాపు 28 నిమిషాలు 10 సెకండ్లు  సమయం పడుతుంది. 

10 -02
 ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో రెండవ స్థానంలో ఉంది మహారాష్ట్రలోని పుణే నగరం. పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందినటువంటి ఈ ప్రాంతం అనేది రోజురోజుకీ  జన బనేది విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దీంతో పుణ్యం నగరంలో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 27 నిమిషాల 50 సెకండ్లు పడుతుంది. 


 ఇక దేశంలోనే  అత్యంత ఎక్కువగా ట్రాఫిక్కు అయ్యేటువంటి  నగరాల్లో న్యూఢిల్లీ మూడవ  స్థానంలో నిలిచింది.  ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 21 నిమిషాల 40 సెకండ్లు పడుతుంది. 


 భారతదేశంలోనే అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి నగరాల్లో ముంబాయి నాలుగో స్థానంలో ఉంది. భారతదేశ ఆర్థిక నగరంగా పేరు పొందిన ఈ ముంబై నగరానికి రాకపోకలనేవి భారీ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి నిత్యం కూడా ఇక్కడ పది కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. 10 కిలోమీటర్లు వెళ్లాలంటే దాదాపు 21 నిమిషాల 20 సెకండ్లు  పడుతుందని ఈ సర్వే తేల్చేసింది.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?