Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయంటే.. 

Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయంటే.. 

Fake University: మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలలో విద్యార్థులు చదువుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిలో కొన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  (యు జి సి) గుర్తించింది. మన భారతదేశంలో ఏకంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. 

 ఇక అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నాలుగు యూనివర్సిటీలు, పశ్చిమ బెంగాల్లో రెండు యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీలు, కర్ణాటకలో  ఒకటి, కేరళలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, పుదుచ్చేరి  లో ఒక యూనివర్సిటీలు నకిలీ అని తేల్చారు. ఇక  గత సంవత్సరం 20 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 21కి చేరింది. యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరికీ కూడా డిగ్రీలు చెల్లవని పేర్కొన్నారు. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీలు నకిలీవని తెలియడంతో తమ యూనివర్సిటీ ఉందో లేదో చెకింగ్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని  గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్ట్ టెస్ట్ మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అలాగే విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా  ఈ రెండు యూనివర్సిటీలు కూడా నకిలీవని తెలిపింది. దీంతో యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ కూడా  ఒక్కసారిగా షాకు కు గురయ్యారు. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

1702
ఎందుకంటే ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పటివరకు చదివింది అంతా కూడా వృధా అన్నమాట. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ రెండు యూనివర్సిటీలు నకిలీ వని తేల్చిన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా యూనివర్సిటీ యాజమాన్యాలను  నిలదీస్తున్నారు. 

మరి ఇప్పటికే వీటిల్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు  ఎలాంటి ఈ సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అన్న విషయం మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు యూనివర్సిటీలో చదువుగా వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా నాశనం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ఒక యూనివర్సిటీలో చేరాలంటే అది నకిలీ లేదా మంచిదో అని తెలుసుకోవాలి. ఆ తరువాత ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని యుజిసి అధికారులు తెలియజేశారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?