Srisailam Temple: కార్తీక్ మాసంలో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?... అయితే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి!

Srisailam Temple: కార్తీక్ మాసంలో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?... అయితే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి!

Srisailam Temple: కార్తీక మాసంలో చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్లడంతో పాటు కొన్ని ట్రిప్స్ కి అయితే వెళ్లాలని అనుకుంటారు. అలాంటి వారికి ఎక్కడికి వెళ్లాలి అనే విషయం మాత్రం అర్థం కాదు. అయితే అలాంటి వారి కోసం  ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ట్రిప్ కి వెళ్తే మాత్రం కచ్చితంగా ఆనందాన్ని పొందుతారు.  తాజాగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం శ్రీశైలం టు  సోమశిల లాంచి  ప్రయాణాన్ని అయితే ప్రారంభించింది. 

ఈ లాంచి ప్రయాణాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఇక ఈ లాంజీలో 120 మంది కూర్చో గల సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉంది.  సోమశిల నుండి ప్రారంభమై  దాదాపు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ 6 గంటల పాటు కృష్ణా నదిలో అలలపై అలాగే ప్రయాణంలో మధురానుభూతిని పొందుతూ ఇక సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుండి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక సోమశిల నుంచి తూర్పున ఉన్న శ్రీశైల క్షేత్రానికి లాంచీలో   మార్గ మధ్యలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

1413

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 ఇక ఈ లాంచీలో ప్రయాణించాలంటే ఎంత ధరను విచ్చించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ప్రయాణం ఏర్పాటులను తెలంగాణ రాష్ట్ర పర్యటన శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్  సైదులు అలాగే కొల్లాపూర్ అడివిశాఖ రేజర్ అధికారి చంద్రశేఖర్ ,  నాగర్ కర్నూలు జిల్లా పర్యటకశాఖ అధికారి కల్వరాల నరసింహ పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపారు. ఇక సోమశిల నుంచి శ్రీశైలానికి  పెద్దలకు అయితే 3వేల రూపాయల టికెట్ను నిర్ణయించారు. అదే కేవలం వన్ వే మాత్రమే అయితే ₹2,000గా నిర్ణయించారు   ఇక అదే చిన్నపిల్లలకు అయితే రాను పోను  2400 రూపాయల టికెట్ ధరను   నిర్ణయించారు.  అదే వండివే అయితే 1600 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పర్యటనశాఖ అధికారులు తెలిపారు. 

 మరి మీరు కనుక ఈ కార్తీకమాసంలో దేవాలయాలతో పాటు ట్రిప్స్ కూడా వెళ్లాలి అని అనుకుంటే ఈ సోమశిలా టు శ్రీశైలం లాంచీ ప్రయాణమైతే చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ప్రయాణాన్ని అయితే అనుభూతి పొందండి . అదికూడా ఒక నదిపై కావడం పర్యాటకులకు ఎంతగానో అనుభూతి అయితే పొందవచ్చు. కాబట్టి మీరు లేదా మీ కుటుంబం అంతా కూడా ఒకసారి ఈ లాంచీలో   ప్రయాణించి చూడండి.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?