ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ, కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్. సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో వారి స్వంత నిధులతో అత్యంత అద్భుతంగా ఆలయం పునర్ నిర్మించి నేడునిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కలెక్టర్,తెలిపారు. రాష్ట్ర,ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి తన సొంత నిధులు రూ.3కోట్లతో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారని, గ్రామంలోఆంజనేయ స్వామి ఆలయ విగ్రహం, ద్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.
శుక్రవారం ఆలయగర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో విగ్రహ ప్రతిష్ఠాపనాకార్యక్రమాన్ని అత్యంతవైభవంగా, కన్నులపండుగగా నిర్వహించారు. అత్యంతవైభవంగా కన్ను ల పండుగ గా విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.