సన్న బియ్యం పథకంలో అర్హులైన వారి అందరికీ (రేషన్ కార్డుదారులకు) పంపిణీ  చేయాలి...

సన్న బియ్యం పథకంలో అర్హులైన వారి అందరికీ (రేషన్ కార్డుదారులకు) పంపిణీ  చేయాలి...

మహబూబాబాద్ జిల్లా,నెల్లికుదురు :- 

గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,తో కలిసి జిల్లాలో ఆకస్మిక పర్యటనలు చేశారు.నెల్లికుదురు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న *రాజీవ్ యువ వికాసం పథకం* దరఖాస్తు దారుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

Read Also ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం వట్టి బూటకం

IMG-20250410-WA0028

Read Also ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.మక్ల కు డాక్టరేట్

దరఖాస్తుదారులకు కావలసిన అన్ని ఏర్పాట్లను సేవా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు  ఈ పథకంలో వర్తించే అన్ని వివరాలు తెలియజేయాలని సూచించారు. 

Read Also మహిళల విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి

నెల్లికుదురు మండలం రేషన్ దుకాణం నెంబర్ 01, ను తనిఖీ చేసి డీలర్ మద్ది బుజ్జమ్మ తో మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన రేషన్ కార్డు దారులందరికి అందించాలని సూచించారు. 
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు ఎండాకాలం నేపథ్యంలో తగిన ఏర్పాట్లను రైతులకు కల్పించాలని సూచించారు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రస్తుత ఎండాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్స్ పరిధిలలో ముందస్తు వైద్య క్యాంపులు నిర్వహించాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యపరంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read Also బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి..

IMG-20250410-WA0032

Read Also అమరుల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలి...

*సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన జిల్లా కలెక్టర్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మహబూబాబాద్ మండలం, జరుపులతండ గ్రామ పంచాయతీ, పరిధిలోని చీకటి చింతల తండలోనీ  సన్న బియ్యం లబ్ధిదారులైన బానోతు గోవింద్ గృహంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్, స్థానిక తహసిల్దార్ భగవాన్ రెడ్డి, తదితర అధికారులు,
ఈ సందర్భంగా కలెక్టర్ గోవిందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారుడు బానోత్ గోవిందు మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కుటుంబం కడుపునిండా భోజనం చేయడం జరుగుతుందని, ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, నెల్లికుదురు తాసిల్దార్ రాజు,మహబూబాబాద్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో రఘుపతి రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

IMG-20250410-WA0026

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?