విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..
On
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని జమస్థాపురం గ్రామ శివారు రూప తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రైతు భూక్య రవి తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడంతో రైతు దంపతులు కన్నేరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందిందని బాధిత రైతులు ఆరోపించారు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులను కోరారు.
Tags:
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...